Priyanka Gandhi: బీజేపీ పై విమర్శల దాడికి దిగారు కాంగ్రెస్ మహిళా నాయకురాలు ప్రియాంక గాంధీ పదేళ్లలో దేశాన్ని సర్వనాశనం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో బొంద పెట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. శనివారం తాండూరు జనజాతర సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ అబద్ధాలు నమ్మి మోసపోయేది లేదని చాటి చెప్పాలని కోరారు. అసలు ఈ రాష్ట్రానికి ఏం చేశారో బీజేపీని అడగాలని సూచించారు. మత విద్వేషాలు ఇక్కడ సాగవని.. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులని అన్నారు. మత కల్లోలాలు ఉంటే.. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదని తెలిపారు. మోడీ పదేళ్ల కాలంలో ధనిక వర్గాలకు మాత్రమే మేలు జరిగిందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతం ఎంతో సుభిక్షమైనదని.. ఎంతో కృషి చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని అన్నారు.
పూర్తిగా చదవండి..Priyanka Gandhi: బీజేపీని బొంద పెట్టాలి.. తెలంగాణ పర్యటనలో ప్రియాంక గాంధీ ఫైర్
TG: పదేళ్లలో దేశాన్ని సర్వనాశనం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో బొంద పెట్టాలని ప్రియాంక గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ అబద్ధాలు నమ్మి మోసపోయేది లేదని చాటి చెప్పాలని కోరారు. అసలు ఈ రాష్ట్రానికి ఏం చేశారో బీజేపీని అడగాలని సూచించారు.
Translate this News: