ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వైట్ హౌస్ లో ఘన స్వాగతం లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు మోడీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవం వందనం స్వీకరించారు. ప్రధాని గౌరవ సూచికంగా 19గన్ సెల్యూట్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం పలు ఒప్పందాలపై బైడెన్, మోడీలు సంతకాలు చేశారు.
పూర్తిగా చదవండి..అప్పుడు సామాన్యుడిగా బయట నుంచి వైట్ హౌస్ చూశాను..!!
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోడీ వైట్ హౌస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు మోడీకి ఘనస్వాగతం పలికారు. అప్పుడు సామాన్యుడిగా అమెరికాకు వచ్చానని..నాడు వైట్ హౌస్ ను బయట నుంచి చూశానని..ఇఫ్పుడు ప్రధాని అయ్యాక పలుమార్లు సందర్శించానని ప్రధాని మోడీ తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు దేశగౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నారని ప్రశంసించారు మోడీ.

Translate this News: