అమెరికా పర్యటనలో భాగంగా తొలిరోజు ప్రధాని నరేంద్ర మోడీ... ఈరోజు న్యూయార్క్లో ట్విట్టర్, టెస్లా వంటి దిగ్గజ కంపెనీల అధినేత ఎలోన్ మస్క్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్లో టెస్లా టు గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులపై మస్క్, ప్రధాని మోడీమధ్య చర్చ జరిగింది. ప్రధానిని కలిసిన తర్వాత ఎలాన్ మస్క్ మాట్లాడారు. ప్రెస్తో మాట్లాడిన మస్క్, 'నేను ప్రధాని మోడీ అభిమానిని' అని అన్నారు. ప్రపంచంలోని ఇతర పెద్ద దేశాల కంటే భారత్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అందుకే భారతదేశ భవిష్యత్తు గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. వచ్చే ఏడాది భారత్లో పర్యటిస్తానని మస్క్ తెలిపారు.
భారత్ కు టెస్లా ఎప్పుడు రానుంది?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత, మస్క్ మాట్లాడుతూ, "ప్రధానితో ఇది గొప్ప సమావేశం, నేను ఆయనను చాలా ఇష్టపడుతున్నాను." త్వరలో భారత్ కు వస్తాను" భారత్ మార్కెట్ పై మీరు ఆసక్తి కలిగి ఉన్నారా అని మస్క్ ను మీడియా ప్రశ్నించింది. ఖచ్చితంగా అంటూ బదులిచ్చాడు మస్క్. ఈ ఏడాది చివరినాటికి తాను టెస్లా తన ఇండియా ఫ్యాక్టరీని స్థాపించడానికి స్థలాన్ని ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. అంతకుముందు 2015లో, కాలిఫోర్నియాలోని టెస్లా మోటార్స్ ఫ్యాక్టరీ పర్యటనలో PM మస్క్ కలుసుకున్నారు.
స్టార్లింక్ సేవలు త్వరలో భారత్ లో ప్రారంభిస్తాం:
ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ తన శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ స్టార్లింక్ గురించి పెద్ద ప్రకటన చేశారు. త్వరలో భారత్లో స్టార్లింక్ ఇంటర్నెట్ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. మస్క్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లలో స్టార్లింక్ ఒకటి. స్టార్లింక్ అంతరిక్షంలో ఉపగ్రహాల సహాయంతో బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. స్టార్లింక్తో పాటు, భారతీ ఎయిర్టెల్ కూడా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి తన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ వన్వెబ్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.