ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగించుకుని ఈజిప్ట్ రాజధాని కైరో బయలుదేరారు. ప్రధాని మోడీ ఈజిప్ట్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన హెలియోపోలిస్ వార్ మెమోరియల్ని సందర్శించి అమరులైన భారత జవాన్లకు నివాళులర్పిస్తారు. ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్, పాలస్తీనాలో మరణించిన సుమారు 4000 మంది భారతీయ సైనికులకు స్మారక చిహ్నం. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఈజిప్ట్లో పర్యటించనున్నారు.
చారిత్రత్మక మసీదును సందర్శించనున్న మోడీ:
బోహ్రా కమ్యూనిటీ సహాయంతో పునర్నిర్మించిన అల్ హకీమ్ మసీదును ప్రధాని మోడీ సందర్శించనున్నారు. ఈజిప్ట్ పర్యటనలో భాగంగా మార్చిలో ఈజిప్ట్ అధ్యక్షుడు భారత పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏర్పడిన ‘ఇండియా యూనిట్’తోనూ ప్రధాని మోడీ సంభాషించనున్న సంగతి తెలిసిందే. ఈ యూనిట్లో పలువురు ఉన్నత స్థాయి మంత్రులు ఉన్నారు.
వ్యాపారం,ఆర్థిక సహకారంపై చర్చ:
ఈజిప్టు అధ్యక్షుడు ఎల్సీసీతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం, వ్యాపార, ఆర్థిక సహకారానికి సంబంధించిన కొత్త రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా కొన్ని అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశం ఉంది.
వ్యూహాత్మక సంబంధాలలో బలం:
ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈజిప్ట్లో పర్యటించాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. భారతదేశం, ఈజిప్టు మధ్య రక్షణ, వ్యూహాత్మక సంబంధాలు సంవత్సరాలుగా లోతుగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో ఇరుదేశాల సైన్యాలు తొలి సంయుక్త విన్యాసాన్ని నిర్వహించాయి.
PM Modi concludes US State visit, emplanes for Egypt
Read @ANI Story | https://t.co/o45sFeEWum#PMModi #NarendraModi #PMModiUSVisit #Egypt pic.twitter.com/pxfM0spwPK
— ANI Digital (@ani_digital) June 24, 2023