మిల్లెట్ల ప్రయోజనాలను, ప్రపంచ ఆకలిని తగ్గించే వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక పాట కోసం గ్రామీ అవార్డు గెలుచుకున్న భారతీయ-అమెరికన్ గాయకుడు ఫాలూతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకరించారు. గీత రచయిత ఫల్గుణి షా ఆమె భర్త గాయకుడు గౌరవ్ షా పాడారు. ఫల్గుణి షాను ‘ఫాలు’ అని పిలుస్తారు. ఈ పాట జూన్ 16న విడుదలైంది. భారతదేశ ప్రతిపాదనపై, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2023 సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం’గా ప్రకటించింది. ప్రధానికి పాటరాసి పాడే సమయం ఎక్కుడుంటుందనే కదా మీ అనుమానం. ఈ డౌట్ రావడం కామన్. శుక్రవారం ఈ పాటను ప్రధాని మోదీ రిలీజ్ చేశారు. అది మోదీనే రాసి..పాడారంటే చాలా మంది నమ్మడం లేదు. తృణధాన్యాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసేందుకు గ్రామీ అవార్డ్ విజేత, ప్రముఖ ఇండో – అమెరికన్ గాయని ఫాల్గుణితో కలిసి మోదీ ఈ పాట రాశారు. ఈ పాటను ఫాలూతోపాటు ఆమె భర్త గౌరవ్ షా కలిసి పాడారు. మధ్యలో ఓ చోట ప్రధాని మోదీ వాయిస్ కూడా వినిపిస్తుంది.
ప్రధాని మోదీ కలిసి పాట రాశారు: ఫాలు
నేను, నా భర్త గౌరవ్ షాతో కలిసి ప్రధాని మోదీ ఈ పాట రాశారు. ఇంగ్లీషు, హిందీ భాషల్లో రాసిన ఈ పాటను అందరికీ అందుబాటులోకి తెస్తామని, తృణధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తామన్నారు. ఫలూ, గౌరవ్ షా జూన్ 16, 2023న ‘అబండెన్స్ ఆఫ్ మిల్లెట్స్’ పాటను విడుదల చేశారు. ఇందులో ‘అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం’ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. ప్రపంచంలో ఆకలిని తగ్గించడంలో ఈ అత్యంత పోషకమైన తృణధాన్యాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ‘మిల్లెట్స్ సమృద్ధి’ పాటను రూపొందించారు. ప్రపంచంలో ఆకలిని తగ్గించడంలో ఈ అత్యంత పోషకమైన ధాన్యం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ‘మిల్లెట్స్ సమృద్ధి’ పాటను రూపొందించారు.
Excellent effort @FaluMusic! There is abundance of health and well-being in Shree Ann or millets. Through this song, creativity has blended with an important cause of food security and removing hunger. https://t.co/wdzkOsyQjJ
— Narendra Modi (@narendramodi) June 16, 2023
ఇప్పుడు ఈ పాట యూట్యూబ్లో అందుబాటులో ఉంది. Abundance in Millets (తృణధాన్యాల్లో సమృద్ధి) పేరుతో ఈ పాటను శుక్రవారం అప్ లోడ్ చేశారు.. ఇప్పటికే 6.3 వేల మంది ఈ వీడియోను చూశారు. చాలా మంది లైక్ కొడుతూ షేర్ చేశారు.