ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాసంలో బుధవారం అర్థరాత్రి బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఐదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి సహా.. ప్రభుత్వ మార్పు, పార్టీ సంస్థాగతంపై చర్చించారు. ప్రధాని మోడీతో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఏడాది చివర్లో జరగనున్న ప్రధాన అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికల కోసం పార్టీ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. అయితే ప్రధాని మోడీ విదేశీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ భేటీ జరగడం హాట్ టాపిగ్గా మారింది. దాదాపు ఐదు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీలో భారీ పునర్వ్యవస్థీకరణపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
పూర్తిగా చదవండి..మోడీ మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణకు సన్నాహాలు..ఆ బాధ్యత కేంద్రమంత్రులకే..!!
2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ బీజేపీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఐదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి సహా.. ప్రభుత్వ మార్పు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన అజెండా 2024 లోక్సభ ఎన్నికలే. ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే క్రమంలో సంస్థాగతంగా మార్పులకు బీజేపీ శ్రీకారం చుట్టింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేర్పిన పాఠాలతో మిగతా రాష్ట్రాల్లో పకడ్బందీగా అడుగులు వేస్తోంది.

Translate this News: