Animal Trailer: ధియేటర్ లో ప్రేక్షకులతో ‘యానిమల్’ ఈలలు వేయిస్తుంది.. ప్రభాస్ రివ్యూ వైరల్ 

సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘యానిమల్’ ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ట్రైలర్ చూసి పాజిటివ్ కామెంట్స్ తో xలో పోస్ట్ చేశారు. దీంతో అది వైరల్ గా మారింది. 

New Update
Animal Trailer: ధియేటర్ లో ప్రేక్షకులతో ‘యానిమల్’ ఈలలు వేయిస్తుంది.. ప్రభాస్ రివ్యూ వైరల్ 

Animal Trailer: ఇప్పుడు దేశవ్యాప్తంగా యానిమల్ సినిమా గురించిన విశేషాలే వినిపిస్తున్నాయి. రణబీర్ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచీ పాన్ ఇండియా లెవెల్ లో ఆసక్తి మొదలైంది. టీజర్ రిలీజ్ అయినపుడు సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. సందీప్ వంగ నుంచి మరో సంచలనం ఖాయం అని అంతా అంచనాలు వేశారు. దానికి తగ్గట్టే ఇప్పుడు యానిమల్ థీరియాట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. రణబీర్ కనిపించిన ప్రతి సన్నివేశం.. అనిల్ కపూర్ రణబీర్ మధ్య వచ్చిన చిన్న చిన్న డైలాగ్స్.. ట్రైలర్ లో అంతర్లీనంగా కనిపించిన ఎమోషన్.. అన్నిటినీ మించి యాక్షన్ బిట్స్ ఒకదాన్ని మించి ఒకటి ఆకట్టుకుని సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. సినిమా ట్రైలర్ కి ప్రేక్షకులు ఇంత ఫిదా అయిపోతే.. దానికి రెండింతలుగా బాలీవుడ్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఖుషీ అయిపోతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో యానిమల్ మానియా మొదలైందని చెప్పవచ్చు. 

ఇప్పటికే చాలా సార్లు సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ ట్రైలర్(Animal Trailer) విడుదల చేసి డిసెంబర్ 1న సినిమా విడుదల అవుతుంది అని ప్రకటించడంతో ప్రేక్షకులు సంతోషంలో మునిగిపోయారు. సినిమా టీమ్ ఎప్పటికప్పుడు సినిమా విశేషాలను పంచుకుంటూ అంచనాలు కలిగించింది. తాజాగా విడుదలైన దీని ట్రైలర్ వాటిని రెట్టింపు చేసేలా ఉంది. అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఎక్కువమంది చూసిన హిందీ ట్రైలర్ల జాబితాలో మూడోస్థానాన్ని సొంతం చేసుకుంది. సందీప్‌ వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్జున్‌గా రణ్‌బీర్‌, గీతాంజలిగా రష్మిక కనిపించనున్నారు.

Also Read: వీడెవడో బావున్నాడే అనిపిస్తోంది అంటున్న నానీ.. 

సినిమా ప్రియులతో పాటు.. సెలబ్రిటీలు కూడా ఈ ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సందీప్ వంగా మెస్మరైజ్ చేశాడని చెబుతూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్ర నటీనటులు యానిమల్ సినిమా ట్రైలర్ అదుర్స్ అంటూ చెబుతూ వచ్చారు. వారి లిస్ట్ లోకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా చేరిపోయాడు. ఈ ట్రైలర్ పై ఇంస్టాగ్రామ్ లో స్టేటస్ వదిలాడు. ‘‘యానిమల్‌’ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అందరి నటన మరో స్థాయిలో ఉంది’’ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ స్టేటస్  వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే, సాధారణంగా ప్రభాస్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు. అటువంటిది యానిమల్ సినిమాపై ఈవిధంగా పాజిటివ్ పోస్ట్ ఇవ్వడంతో ప్రభాస్ ఫాన్స్ దాని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ కంటే ఎక్కువగా టాలీవుడ్ లో యానిమల్ ట్రెండ్ కనిపిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. 

publive-image Prabhas insta status on Animal tailer

ఇక మరోవైపు బాలీవుడ్‌ ప్రముఖులు ఈ ట్రైలర్‌ను షేర్‌ చేస్తూ  సినిమా ఇంకెంత అదరగొట్టేస్తుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలియా భట్‌ దీనిపై పోస్ట్‌ పెట్టారు.‘‘ ట్రైలర్‌ చూస్తుంటే ఇప్పుడే సినిమా చూడాలనిపిస్తోంది. డిసెంబర్‌ 1 కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. థియేటర్లో కచ్చితంగా ఆడియన్స్‌తో ఈలలు వేయిస్తుంది’’ అని రాసుకొచ్చారు. అలాగే కరీనా కపూర్‌ స్పందిస్తూ.. రణ్‌బీర్‌ (Ranbir Kapoor) మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలడని పేర్కొంటూ ‘యానిమల్’ టీమ్‌కు అభినందనలు తెలిపారు.

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు