Peddapalli: పెద్దపల్లిలో క్షుద్రపూజలు...ఆరుగురు నిందితుల అరెస్ట్‌!

పెద్దపల్లి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేగింది. క్షుద్రపూజలు చేస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందపల్లి ఎస్‌ఆర్‌ఎస్పీ కెనాల్ దగ్గర అర్ధరాత్రి కొందరు ఖాళీ స్థలంలో ఓ గుడిసె వేసి గొయ్యి తవ్వారు. తెల్లవారు జామున అటుగా వచ్చిన స్థానికులు గమనించారు.

New Update
Peddapalli: పెద్దపల్లిలో క్షుద్రపూజలు...ఆరుగురు నిందితుల అరెస్ట్‌!

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. క్షుద్రపూజలు చేస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందపల్లి ఎస్‌ఆర్‌ఎస్పీ కెనాల్ దగ్గర అర్ధరాత్రి కొందరు ఖాళీ స్థలంలో ఓ గుడిసె వేసి గొయ్యి తవ్వారు. తెల్లవారు జామున అటుగా వచ్చిన స్థానికులు గమనించారు.

గొయ్యి తవ్విన ప్రాంతంలోపసుపు,కుంకుమ,నిమ్మకాయలు,గడ్డపారలను చూసి భయాందోళనలకు గురయ్యారు.పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు పోలీసులు.కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గుప్త నిధుల కోసం ఇలా చేశారని స్థానికులు అంటున్నారు. అయితే గుప్త నిధుల కోసమా లేక... అమాయకపు ప్రజల బలహీనతను అడ్డం పెట్టుకుని క్షుద్రపూజల పేరు సొమ్ము చేసుకుంటున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Also read: మంచి మనస్సు చాటిన ఏపీ మంత్రి సవిత.. రోడ్డు ప్రమాదాన్ని చూడగానే..

Advertisment
తాజా కథనాలు