/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Nandyal-Murder-.jpg)
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సంచలనం సృష్టించిన భూమ అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. A1 షిండే చంద్రకుమార్, A3 షేక్ మాలిక్ బాషా, A7 తప్పేట నరసింహను అరెస్ట్ చేశారు. అయితే.. ఇదే కేసులో A2 ఏవీ సుబ్బారెడ్డి, A6 ఆటో డ్రైవర్ చంటి పరారయ్యారు. ఈ కేసులో A2 సుబ్బారెడ్డి పాత్ర కీలకమని భావిస్తున్న పోలీసులు ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ ఇద్దరు నిందితులను పట్టుకుంటామని స్థానిక డీఎస్పీ తెలిపారు.