గత వారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. పొంగిపొర్లిన వాగులు,వంకలు గ్రామాలను ముంచెత్తి గ్రామస్తులను కట్టుబట్టలతో మిగిల్చాయి. ఇక మోరంచ వాగు ఉధృతికి నిండా మునిగిపోయిన మోరంచపల్లి ప్రజల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. గత గురువారం వాగు నీటితో గ్రామం మొత్తం మునిగిపోవడంతో చెట్లెక్కి, బిల్డింగులు ఎక్కి ప్రాణాలను నిలబెట్టుకున్నారు గ్రామస్తులు. మరికొందరు ప్రాణాలను కాపాడుకోవడానికి ఊరిని వదిలిపెట్టి పరుగులు తీశారు.
పూర్తిగా చదవండి..మమ్మల్ని ఆదుకోండి ప్లీజ్..ఆపన్న హస్తం కోసం మోరంచపల్లి గ్రామస్తుల ఎదురుచూపులు!
Translate this News: