AP: చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.. పిఠాపురం ఎస్పీ సతీష్!

ఏపీలో ఎన్నికల గొడవలపై పిఠాపురం ఎస్పీ సతీష్ కీలక సూచనలు చేశారు. పిఠాపురం ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని కోరారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

New Update
AP: చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.. పిఠాపురం ఎస్పీ సతీష్!

Pithapuram: ఏపీలో ఎన్నికల వేళ జరుగుతున్న అల్లర్లపై పిఠాపురం ఎస్పీ సతీష్ కీలక సూచనలు చేశారు. శుక్రవారం పిఠాపురం ఆర్‌ఆర్‌బి‌హెచ్ఆర్ కాలేజ్ ఎదురుగా మున్సిపల్ కళ్యాణ్ మండపంలో కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 4న జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల ఓట్ల లెక్కింపు సమయంలో పిఠాపురం ప్రజలంతా శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని కోరారు. కౌంటింగ్ సమయంలో ప్రశాంత వాతావరణానికి సహకరించాలి. రాజకీయ వివాదాల్లో చిక్కుకొని యువత బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. పిఠాపురం ప్రజలందరూ కూడా న్యూస్ ఛానల్‌లో ప్రచారమైయ్యే కౌంటింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలని కోరుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంది. పట్టణ ప్రజలేవ్వరూ కూడా అల్లర్లకు సహకరించరాదు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు