Pick Pocketing: ఎవరైనా బయటకు వెళుతున్నప్పుడు.. ఇంటిలో పెద్దవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళిరా.. జేబులో డబ్బు జాగ్రత్త.. అనేవాళ్ళు ఒకప్పుడు. అలాగే, బస్సులు.. ట్రైనులు.. సినిమాహాళ్లు.. ఎగ్జిబిషన్స్.. ఇలా జనం ఎక్కువగా చేరే చోట జేబుదొంగలున్నారు జాగ్రత్త అనే హెచ్చరికల బోర్డులు కనిపించేవి. ఇక సినిమాల్లో హీరోలు.. ఒక్కో సినిమాలో హీరోయిన్లు కూడా జేబు దొంగతనాలు చేస్తూ.. ఆ డబ్బుతో జల్సాలు చేయడమో.. వాళ్ళ పేదరికంతో తప్పనిసరి అయి చేస్తున్నారన్న జస్టిఫికేషన్ తోనూ సీన్లు కోకొల్లలుగా కనిపించేవి. జేబుదొంగతనాల కోసం చిన్న పిల్లలను కూడా ఆ మార్గంలో పెట్టె పని చేశేవారు. కానీ ఇప్పుడు ఇవన్నీ మాయం అయిపోయాయి. ఎందుకు? పెటీఎం లేదా ఫోన్ పే లాంటివి జేబు దొంగలకు పని లేకుండా చేశాయి. జేబు దొంగతనం చేసి కడుపు నింపుకునే నేరగాళ్ల పొట్ట గొట్టాయి ఈ యూపీఐ యాప్స్ అని ఒక పెద్దాయన జోకేడు. అది నిజమే. ఇప్పుడు మనలో ఎవరూ జేబులో డబ్బులు పెట్టుకోవడం లేదు. ఒకవేళ అత్యవసరం కోసం జేబులో డబ్బు పెట్టుకున్నా అది వందా, రెండు వందలకు మించి ఎవరూ ఉంచుకోవడం లేదు. దీంతో కష్టపడి తెలివితేటలూ ఉపయోగించి జేబు జాగ్రత్తగా కత్తిరించేంత కష్టం ఎవరు పడతారు చెప్పండి. అందుకే గణనీయంగా జేబు దొంగతనాల కేసులు దేశవ్యాప్తంగా తగ్గినట్టు పోలీసులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Pick Pocketing: జేబుదొంగల పొట్టకొట్టిన పేటీఎం.. ఆ రూటు పట్టిన బ్లేడ్ బాబ్జీలు
పేటీఎం, ఫోన్ పే, జీపే వంటి యూపీఐ యాప్స్ వచ్చిన తరువాత బ్లేడు బాబ్జీలు రూటు మార్చారు. ప్రజలు జేబుల్లో డబ్బు పెట్టడం మానేశారు. దీంతో జేబుదొంగలు రూటు మార్చారు. సైబర్ దొంగతనాల వైపు.. కొత్త మోసాల వైపు మళ్ళారు. ఎప్పటికప్పుడు కొత్త తరహాలో ప్రజలను దోచేస్తున్నారు.
Translate this News: