Peddireddy: చంద్రబాబు అందుకే అబద్ధాలు వల్లిస్తున్నాడు

చంద్రబాబు అధికారంలోకి రావాలని అబద్ధాలు చెబుతున్నాడని విమర్శలు గుప్పించారు మంత్రి పెద్దిరెడ్డి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలు చేయాలంటే రూ. 2. 50 లక్షల కోట్లు కావాలన్నారు. తప్పుడు వాగ్దానాలు, మోసపూరిత మాటలను నమ్మి మోసపోద్దని ప్రజలను కోరారు.

Peddireddy: చంద్రబాబు అందుకే అబద్ధాలు వల్లిస్తున్నాడు
New Update

Minister Peddireddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో రావాలని తహతహలాడుతూ అబద్ధాలు వల్లిస్తున్నాడని విమర్శలు గుప్పించారు. సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలు చేయాలంటే 2 లక్షల 50 వేల కోట్లు కావాలన్నారు.

Also Read: ఉండి టీడీపీలో బిగ్‌ట్విస్ట్‌.. సీటు మార్చడంతో రామరాజు వర్గం ఆందోళన

చంద్రబాబు మోసపూరితంగా కుట్రపూరితంగా అధికారంలో రావాలని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసే తప్పుడు వాగ్దానాలు మోసపూరిత మాటలను నమ్మి మోసపోద్దని ప్రజలను కోరారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశారని కొనియాడారు. ఈ ఎన్నికల్లోనూ వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

#peddireddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe