‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ హీరోయిన్ కు కిడ్నీ ఇన్ఫెక్షన్‌..!!

‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ‘మంగళవారం’ మూవీ ట్రైలర్ ఈవెంట్‌లో తన ఆరోగ్య సమస్యల గురించి ప్రేక్షకులకు తెలిపింది. తనకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందని, డాక్టర్లు కచ్చితంగా ఆపరేషన్ చేయాలన్నారని చెప్పింది. అయితే, అజయ్ చెప్పిన కథ ఎంతో నచ్చడంతో సినిమా కంప్లీట్ చేసిన తర్వాతే సర్జరీ చేయించుకునేందుకు డిసైడ్ అయినట్లు చెప్పింది. దీంతో పాయల్ ప్రాణాలకు తెగించి రిస్క్ చేసిందంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

New Update
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ హీరోయిన్ కు కిడ్నీ ఇన్ఫెక్షన్‌..!!

Payal Rajput: ‘మంగళవారం’ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హీరో కార్తికేయ హాజరై ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మీడియాతో పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ..తను ఏ పరిస్ధితిలో ఈ మూవీ చేసిందో చెప్పుకొచ్చింది.

‘మంగళవారం’  ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన ఆరోగ్య సమస్యల గురించి ప్రేక్షకులకు తెలిపింది. తనకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందని, డాక్టర్లు కచ్చితంగా ఆపరేషన్ కూడా చేయాలన్నారని చెప్పింది. ‘‘అజయ్ ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్ అయ్యే టైంకి నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలీదు. అప్పుడు నేను కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాను. డాక్టర్స్ సర్జరీ చేయాల్సిందేనని కచ్చితంగా సూచించారు. అయితే, అజయ్ చెప్పిన కథ నాకెంతో నచ్చేసింది. ఈ సినిమా తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నా. సినిమా పూర్తి చేశాకే సర్జరీకి వెళ్తానని చెప్పాను’’ అని ఆమె తెలిపింది.

Also Read: నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను..వెల్లడించిన హీరో భార్య!

‘‘ఇది నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు, ట్రైలర్ విడుదలైన కొన్ని క్షణాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. నా కెరీర్ ఎటు వెళుతోందో తెలియని అనిశ్చితి నెలకొన్న సమయంలో ‘మంగళవారం’ సినిమా వచ్చింది. ‘ఆర్ఎక్స్ 100’తో అజయ్ భూపతి నన్ను లాంచ్ చేశారు. అది నా కెరీర్‌ను మార్చేసింది. ఇప్పుడు ‘మంగళవారం’లో అవకాశం ఇచ్చి మరోసారి నన్ను లాంచ్ చేస్తున్నారు. ఆయనకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘ఆర్ ఎక్స్ 100’ తరువాత సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్న పాయల్ మరోసారి తన కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు అజయ్‌నే నమ్ముకుంది. మరోవైపు, ‘మంగళవారం’ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

Advertisment
తాజా కథనాలు