Pawan Kalyan: పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. పిఠాపురంలో ప్రయోగాత్మకంగా..!

నీటి కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలు పూజించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయాల్లో ప్రసాదాల పంపిణీకి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడాలన్నారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. పిఠాపురంలో ప్రయోగాత్మకంగా..!
New Update

Pawan Kalyan: రాష్ట్రంలో కాలుష్యం తగ్గించడం, పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌ కార్యాలయానికి స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి పలు సూచనలు, అభిప్రాయాలు పవన్ కల్యాణ్ కార్యాలయానికి అందుతున్నాయి. అనేక మంది తమ అనుభవాలను తెలియచేస్తూ నివేదికలు పంపిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ ను మంగళగిరిలోని (Mangalagiri) ఆయన నివాసంలో ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, పర్యావరణ ప్రేమికుడు విజయ రామ్ కలిశారు. పర్యావరణానికి హాని చేయని విధంగా వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు అవసరమైన సూచనలు చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన గోవింద భోగ్, రత్న చోడి, మాప్పిల్లై సాంబ తదితర బియ్యం రకాలను పవన్ కు చూపించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పర్యావరణ హితమైన వస్తువుల వాడకాన్ని మన వేడుకలు, ఉత్సవాల్లో వాడితే మేలు కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వినాయక చవితి (Vinayaka Chavithi) రాబోతుందని.. ఈ సందర్భంగా నిర్వహించే వేడుకల్లో మట్టి గణపతి (Clay Ganesha) ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. మట్టి గణపతుల ద్వారా జల కాలుష్యాన్ని అరికట్టవచ్చన్నారు. మట్టి గణపతికి పూజలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

ప్రయోగాత్మకంగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలు పూజించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం దేవాలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్ తో చేసిన కవర్లలో అందిస్తున్నారన్నారు. బటర్ పేపర్ వినియోగాన్ని తగ్గించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారని తెలిపారు. అలాంటి కవర్ల స్థానంలో చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడాలని సూచించారు. తద్వారా వాటి వ్యర్థాల నిర్వహణ కూడా సులభమన్నారు. వీటి వినియోగాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నట్లు వివరించారు పవన్ కల్యాణ్‌.

Also Read: గల్లంతైన లగేజీల జాబితాలో ఎయిర్ ఇండియా అగ్రగామి!

#pawan-kalyan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe