/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/school-5.jpg)
Pawan kalyan: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ప్రజలు విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో సైతం ప్రజలకు వరద కష్టాలు తప్పడం లేదు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని శుద్ధ గడ్డ వాగు మళ్లీ పొంగిపొర్లడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పడవపై ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి.
Also Read: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు నారా భువనేశ్వరి భారీ విరాళం
స్కూల్కి వెళ్లాలంటే పిల్లలు పడవ ఎక్కి వాగు దాటాల్సిందే. లైఫ్ జాకెట్ లేకుండా పడవలపై ప్రమాదకరంగా స్కూల్ పిల్లలు, కాలనీవాసుల ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. అయితే, వర్షాలు వచ్చిన ప్రతిసారి మా పరిస్థితి ఇదేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్కూలు పిల్లలు, కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.