TDP Leader Varma : ఇటీవల పిఠాపురం (Pithapuram) నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వర్మ (Varma) పై కొందరు జనసేన నేతలు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వర్మ కు చెందిన కారు పూర్తిగా ధ్వంసమైంది. వర్మకు సైతం గాయాలు అయ్యాయి. పవన్ కోసం తన సీటును త్యాగం చేసి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించిన వర్మపై జనసేన నేతలు దాడికి దిగడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఇది పవన్ కు సంబంధం లేదని.. జనసేనలో కొత్తగా చేరిన వారు చేసిన పని అంటూ వర్మ ప్రకటించారు. ఈ దాడిలో జనసేన నేతలు ఎవరైనా ఉంటే చర్యలు ఉంటాయని నిన్న నాగబాబు ప్రకటన విడుదల చేశారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan : పిఠాపురానికి పవన్ కల్యాణ్.. వర్మపై దాడి ఘటనపై సీరియస్?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. అక్కడి నుంచి పిఠాపురం వెళ్లనున్నారు. నియోజకవర్గానికి నేతలతో సమావేశం కానున్నారు. టీడీపీ - జనసేన నేతల మధ్య నెలకొన్న అసమ్మతి, టీడీపీ ఇన్ఛార్జి వర్మపై దాడి అంశాలను పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Translate this News: