Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ 20 మంది పార్టీ అభ్యర్థులకు బీ-ఫామ్లను అందజేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులతో స్వయంగా ప్రమాణం చేయించారు. ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి విజయం రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి అభ్యర్థి గెలవాలని కోరారు. వలసలు లేని.. పస్తులు లేని ఏపీ ఏర్పాటు మనందరి బాధ్యతన్నారు.
Also Read: సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్..!
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శలు గుప్పించారు. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలే దేవుళ్లని.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. పోలవరం పూర్తి, నదుల అనుసంధానానికి కృషి చేస్తానని కామెంట్స్ చేశారు.
Also Read: 30 ఏళ్లు దాటాక డేటింగ్లో ఈ తప్పులు అస్సలు చేయకండి
విద్య, ఉపాధి అవకాశాలు, అభివృద్ధికి కంకణబుద్ధులై పనిచేస్తామన్నారు. ఎన్డీయే కూటమి గెలపునకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని భరోసా కల్పించారు. అవినీతి, రాక్షస పాలనను తరిమికొట్టాలన్నారు. అందరూ కలిసి పనిచేయాలని.. ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. వివాదాలకు తావు లేకుండా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.