ఏలూరు బహిరంగా సభలో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓవైపు పవన్ టార్గెట్గా వైసీపీ నేతలు మాటల తుటాలు పేల్చుతుంటే మరోవైపు మహిళా వాలంటీర్లు జనసేనానిపై మండిపడుతున్నారు. పవన్ తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ చేసిన వ్యాఖ్యల్లో అసలు అనువంతైన నిజం లేదని ఫైర్ అవుతున్నారు. కరోనా సమయంలో..అందరూ ఇళ్లలోనే ఉండిపోయిన సమయంలో తాము మాత్రమే బయటకు వచ్చి ప్రజలకు సేవ చేశామన్న విషయం మరవద్దన్నారు. సాక్ష్యాలు ఉంటే చూపించాలని..అంతేకాని నోటికి వచ్చింది మాట్లాడవద్దని చురకలంటిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Pawan vs Volunteers: పవన్పై మండిపడుతున్న మహిళా వాలంటీర్లు.. జనసేన అధినేతలకు మహిళా కమిషన్ నోటీసులు
ఏపీలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను చిక్కుల్లో పడేశాయి. తాజాగా ఏపీ మహిళా కమిషన్ పవన్కి నోటీసులు జారీ చేసింది. ఏలూరులో మహిళల మిస్సింగ్పై పవన్ చేసిన ఆరోపణలపై ఆధారాలివ్వాలని కోరింది.. 10 రోజులలో సమాధానం ఇవ్వాలని నోటీస్లో పేర్కొంది.
Translate this News: