వాలంటీర్లపై ఏలూరు బహిరంగ సభలో జనసేన అధినేత చేసిన వ్యాఖ్యల వేడి చల్లారకముందే పవన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల డేటాను దొంగిలిస్తున్నారు.. ఇంట్లో ఎంత మంది ఉంటారు.. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా.. భర్త బయటకు వెళ్లినప్పుడు భార్య ఏం చేస్తుంది.. భర్త ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు లాంటి వివరాలు వాలంటీర్లకు ఎందుకని ప్రశ్నించారు. అందరూ వాలంటీర్లు అలా లేరంటునే..వాళ్ల వ్యవస్థను తప్పుబట్టారు. కలెక్టర్లు.. ఎమ్మోర్వోలు లాంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పుడు మరో సమాంతర వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత డేటా ఎక్కడికో పోతుందని.. జగన్ ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకురావడానికి వేరే ఉద్దేశం ఉండవచ్చు అని.. అది పార్టీని బలపేతం చేసుకునేందుకు కావొచ్చు అని.. ఇలా డేటా చోరీకి మాత్రం కాదంటూ విమర్శలు గుప్పించారు.
పూర్తిగా చదవండి..Pawan kalyan: వాలంటీర్లపై మరోసారి పవన్ సంచలన వ్యాఖ్యలు..అందరి గురించి కాదంటూనే..!
వాలంటీర్ల వ్యవస్థపై మరోసారి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను అదుపు చేయడానికే వాలంటీర్ వ్యవస్థ అని ఆయన ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థ సేకరించిన డేటా ఎక్కడికో వెళుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు సేవలు అందించేందుకు ఇన్ని వ్యవస్థలు ఉండగా వాలంటీర్ వ్యవస్థతో పనేంటని ప్రశ్నించారు.
Translate this News: