ప్రశాంతమైన విశాఖ నగరంలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. సిరిపురంలో సీబీసీఎన్సీ(CBCNC)భూములను ఆయన పరిశీలించారు. ఈ నేపథ్యంలో CBCNC భూముల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు దోపిడికి పాల్పడుతున్నారని విమర్శించారు. చర్చి భూములను అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారన్నారు. వైసీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయని.. ప్రజలు అన్ని గమనించాలని కోరారు. వైజాగ్ నుంచి ఎంపీ ఎంవీవీ ఎందుకు వెళ్ళిపోతాను అంటున్నారని ప్రశ్నించారు. రౌడీలు గుండాలు రాజ్యమేలుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాగా క్రిస్టియన్ ట్రస్ట్కు చెందిన ఈ వివాదాస్పద భూములను, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వానికి చె౦దాల్సిన భూములను వెనక కోట్ల రూపాయలు చేతులు మారాయి అరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ భూములను పరిశీలించారు.