ప్రత్యర్థి కెప్టెన్గా ధోనీ(Dhoni) ఉన్నప్పుడు భారీ స్కోర్ సాధించడం అంత ఈజీ కాదు. టెస్టు ఫార్మెట్ సంగతి పక్కనపెడితే లిమిటెట్ ఓవర్లతో పాటు ఐపీఎల్లోనూ మహేంద్రుడి కెప్టెన్సీ తిరుగులేనిది. బ్యాటర్ల మైండ్సెట్ని ముందుగానే అర్థం చేసుకుంటూ, ఫీల్డింగ్ మారుస్తూ.. బౌలర్లను ఛేంజ్ చేస్తూ..ఇలా ఏదీ చేసినా సరే ఆ ప్లాన్ 90శాతం సక్సెస్ అవ్వాల్సిందే. అందుకే ఐపీఎల్(IPL)లో చెన్నై సూపర్ కింగ్స్(CSK)ని డామినెట్ చేసిన బ్యాటర్లు కొద్దీమందే ఉంటారు. పొలార్డ్, మ్యాక్స్వెల్, సచిన్..ఇలా పలువురు ప్లేయర్లు చెన్నైని బోల్తా కొట్టించిన వాళ్లలో ఉండగా..మరో క్రికెటర్ సైతం ధోనీ గుండెల్లో దడ పుట్టించాడు.. చెన్నై జట్టుపై ఏకంగా సెంచరీ బాది మ్యాచ్ తర్వాత ధోనీతోనే ప్రశంసలు అందుకున్నాడు. ఉన్నన్ని రోజులు ఐపీఎల్లో హిట్టింగ్ చేస్తూ అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన పాల్ వాల్తాటి(Paul valthaty) తన క్రికెట్ కెరీర్కి వీడ్కోలు పలికాడు. అయితే ఐపీఎల్ ఫ్యాన్స్ పాల్ వాల్తాటిని చూసి చాలా కాలం ఐపోయింది. అతను ఆటకు దూరమై చాలా సంవత్సరాలు గడిచింది. 2011 ఐపీఎల్ సీజన్లో సెంచరీ బాదిన పాల్ వాల్తాటీ తర్వాత ఎక్కువగా ఎందుకు కనిపించలేదు..?
పూర్తిగా చదవండి..Retirement: ధోనీకే చుక్కలు చూపించిన మొనగాడు..రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ సెంచరీ వీరుడు..!
ఐపీఎల్లో రాజస్థాన్, పంజాబ్ తరుఫున ఆడిన పాల్ వాల్తాటి క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011లో చెన్నై సూపర్ కింగ్స్పై సెంచరీతో లైమ్ లైట్లోకి వచ్చిన వాల్తాటి ధోనీ చేత ప్రసంశలు అందుకున్న అతి కొద్దిమంది బ్యాటర్లలో ఒకరు.
Translate this News: