పశ్చిమ బెంగాల్, కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన కలకలం రేపింది. బుధవారం రాత్రి 9.20గంటలకు ఎయిర్ పోర్టులోని చెక్-ఇన్ ఏరియాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వెంటనే ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. దట్టమైన పొగ ఎయిర్ పోర్టులో కమ్మేసింది. ఈఘటనపై సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. రెండు ఫైరింజన్ల సాయంతో దాదాపు 20 నిమిషాలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్య్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఎయిర్ పోర్టులు అధికారులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..కోల్కతా ఎయిర్ పోర్టులో అగ్నిప్రమాదం…భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు..!!
Translate this News: