కొడుకును చంపిన రౌడీ షీటర్లపై పగ తీర్చుకున్న తల్లి..!

పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో నివాసం ఉంటున్న జాన్‌బీ అనే మహిళ కుమారుడు దారుణహత్యకు గురయ్యాడు. ఆ తల్లి మాత్రం భోరున ఏడవలేదు...పైగా కొడుకు మృతదేహం సాక్షిగా హంతకులను తుదముట్టిస్తానని ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చింది కూడా.., తన కొడుకును చంపిన ఇద్దరు హంతకులు రౌడీ షీటర్లైనా ఆమె భయపడలేదు. నింపాదిగా ఇద్దరిని చంపి తన పగ తీర్చుకున్న వైనం..

New Update
కొడుకును చంపిన రౌడీ షీటర్లపై పగ తీర్చుకున్న తల్లి..!

palnadu-mother-son-murder-mystery-reveal-police-sensational-narsaraopeta

గత కొన్నేళ్లుగా.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జాన్‌బీ అనే మహిళ నివసిస్తుంది. ఆమె భర్త 15 ఏళ్ల క్రితమే మరణించాడు. ఇద్దరు కొడుకులతో పాటు కూలి పనికెళ్ళి జీవనం కొనసాగిస్తుంది. కాగా.. ఆమెతో రౌడీ షీటర్ షేక్ బాజీ , ఖాసీం అనే ఇద్దరు వ్యక్తులు సాన్నిహిత్యం ఏర్పరుచుకున్నారు. ఇది నచ్చని జాన్ బీ పెద్ద కుమారుడు తరచూ గొడవపడేవాడు. దీంతో ఖాసీం, షేక్ బాజీ ఇద్దరు జాన్ బీ పెద్ద కుమారుడిని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. 2021 ఆగస్ట్‌ లో జాన్ బీ పెద్ద కుమారుడిని దారుణంగా హతమార్చారు.

ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కడతేర్చుతానని జాన్ బీ తన కొడుకు శవం దగ్గరే ప్రతిజ్ఞ చేసింది. అదే 2021 డిసెంబర్ లో ప్రధాన నిందితుడైన ఖాసీంను నర్సరావ్ పేట సినిమా హాల్ వద్ద హతమార్చి పోలీసులకు లొంగిపోయింది. బెయిల్ పై తిరగొచ్చిన ఆమె రెండో హంతకుడి కోసం వేచి చూసింది. ఇక రెండో నిందితుడు షేక్ బాజీ ఈమెకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పట్టువదలని జాన్ బీ అతని ఫోన్ నెంబర్ సంపాదించింది. వలపు వల విసిరి మళ్ళీ ఎప్పటిలానే కలిసుందాం రా..అంటూ తీయగా మాట్లాడింది. ఒంటరి తనంతో వేగ లేకున్నానని, నీ తోడు కావాలని నమ్మించింది. దీంతో రౌడీ షీటర్ బాజీ గత మంగళవారం రాత్రి ఆమె వద్దకు వచ్చాడు. అప్పటికే జాన్ బీ తన తమ్ముడు హుస్సేన్, అతని మిత్రులు గోపీ కృష్ణ , హరీష్‌లతో కలిసి హత్యకు పథకం వేసింది.

నరసరావుపేట సమీపంలోని గుట్టల్లోకి బాజీని తీసుకెళ్ళి ఫుల్‌ గా మద్యం తాగించింది. మద్యం మత్తులో ఉన్న షేక్ బాజీని తన తమ్ముడు , అతని మిత్రులతో కలిసి దారుణంగా కత్తులతో నరికి చంపింది. ఆ తరువాత పెట్రోల్ పోసి దహనం చేసేందుకు ప్రయత్నించినా , అది సఫలం కాకపోవడంతో గొయ్యి తీసి పాతి పెట్టి ... పోలీసులకు లొంగిపోయింది. నరసరావు పేట గ్రామీణ సీఐ భక్తవత్సల రెడ్డి, ఎస్సై బాల నాగిరెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి బాజీ మృతదేహాన్ని వెలికితీశారు. కొడుకు హత్యకు ప్రతీకారం తీర్చుకున్న జాన్ బీ ప్రశాంతంగా జైల్లో కూర్చుని చిరునవ్వులు చిందిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు