మా లక్ష్యం అదే: నిమ్మల రామానాయుడు ఇంటర్వ్యూ

అన్ని వర్గాల ప్రజలు కసితో ఓటు వేసి కూటమికి భారీ విజయం అందించారని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ఇది చారిత్రకమైన విజయం అన్నారు. బాధ్యతతో పని చేసి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. ఆర్టీవీకి నిమ్మల ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

Nimmala Rama Naidu: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిమ్మల రామానాయుడు
New Update

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 1983, 1994 ప్రభంజనానికి మించి భారీ విజయం సాధించిందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. యువత, మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి నిరంకుశ, నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించారన్నారు. ఈ గెలుపు తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజల రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా తామంతా కలిసి పని చేస్తామన్నారు. ఈ రోజు కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి హాజరైన సమయంలో నిమ్మల ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి