Revanth Reddy: రూ.25లక్షలు.. ఆపై ప్రతీ నెలకు రూ.25వేల పెన్షన్‌.. పద్మ అవార్డు విన్నర్‌లకు గుడ్‌న్యూస్‌!

పద్మ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. అవార్డు విన్నర్‌లకు నగదు ప్రొత్సాహాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. ఇకపై పద్మశ్రీ గ్రహీతలకు సన్మానం చేయడంతో పాటు రూ.25 లక్షల నగదును అందజేస్తామన్నారు. అంతేకాదు ప్రతి నెలా 25వేల పెన్షన్ కూడా ఇస్తామన్నారు.

New Update
Revanth Reddy: రూ.25లక్షలు.. ఆపై ప్రతీ నెలకు రూ.25వేల పెన్షన్‌.. పద్మ అవార్డు విన్నర్‌లకు గుడ్‌న్యూస్‌!

Money  Reward For Padma Winners: పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అవార్డు విన్నర్‌లకు నగదు ప్రొత్సాహాన్ని అందిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25లక్షల నగదు బహుమతి ఇస్తున్నట్టు చెప్పారు. ప్రతి నెలా వారి ఖర్చుల కోసం రూ.25వేల పెన్షన్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. పేద కవులకు, కళాకారులకు చప్పట్లు, దుప్పట్లే చివరకు మిగులుతున్నాయని.. అందుకే ఆర్థికంగా కూడా అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. పద్మ అవార్డు గ్రహీలను రాష్ట్ర ప్రభుత్వం సన్మానించడం ఇదే తొలిసారి.
(This is an updating story)

Advertisment
తాజా కథనాలు