పార్లమెంటు వర్షాకాల (Monsoon Session) సమావేశాల్లో మణిపూర్ హింసాకాండ (Manipur violence)పై ఉత్కంఠ రేగనుంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో ప్రతిపక్షాలు వివరణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశంలో విపక్షాలు ఈ విషయంలో ప్రధాని ప్రకటనను డిమాండ్ చేయడంపై పట్టుదలగా ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ విషయంలో చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ ఇదివరకే వెల్లడించింది. హోంమంత్రి ప్రకటన అనంతరం ఈ అంశంపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది.
పూర్తిగా చదవండి..నేడు పార్లమెంట్లో మణిపూర్ పై చర్చకు ప్రతిపక్షాల వ్యూహం…భేటీ కానున్న విపక్షాలు..!!
వాయిదా అనంతరం తిరిగి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ రోజుల సభాకార్యక్రమాలు ప్రారంభమయ్యే ముందు విపక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు అన్ని విపక్షాల నేతలు నిరసనలు తెలుపనున్నారు.
Translate this News: