మధ్యప్రదేశ్లోని భోపాల్లో మంగళవారం నిర్వహించిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్షాలపై మోడీ డైరెక్ట్ గా అటాక్ చేశారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని..కానీ దాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మోడీ ఆరోపించారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది దేశ బహుళత్వం, వైవిధ్యాన్ని దెబ్బతీయడమేనని ఆరోపిస్తున్నాయి. ప్రధాని మోడీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాంగ్రెస్, డీఎంకే, ఎంఐఎం పార్టీలు ఆరోపించాయి.
పూర్తిగా చదవండి..మోడీ వ్యాఖ్యలను తప్పుపట్టిన ప్రతిపక్షాలు…!!
దేశంలో ఉమ్మడి ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని ...దాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. మంగళవారం భోపాల్లో నిర్వహించిన సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇది దేశ బహుళత్వం, వైవిధ్యాన్ని దెబ్బతీయడమే అని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు.
Translate this News: