బెంగళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల భేటీ వాయిదా..ఎందుకంటే..!!

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విపక్షపార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. బీజేపీ వ్యతిరేకంగా పలు పార్టీలు గతనెలలో బీహార్ రాజధాని పాట్నాలో సమావేశం అయి పలు అంశాలపై చర్చించాయి. తదుపరి చర్యలను బెంగళూరులో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశం ఇప్పుడు వాయిదా పడింది.

బెంగళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల భేటీ వాయిదా..ఎందుకంటే..!!
New Update

బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు విపక్షలపాటు ఏకతాటికపైకి వచ్చేందుకు ప్రయత్నాలు షురూ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్ 23న బీహార్ రాజధాని పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం తదుపరి సమావేశం జూలై 13-14 తేదీల్లో బెంగళూరులో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఈ సమావేశం వాయిదా పడింది. పార్లమెంట్ సమావేశాల కారణంగా ఈ సమావేశం వాయిదా పడింది. అలాగే కర్ణాటక, బీహార్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున సమావేశం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమావేశానికి చాలా మంది ప్రతిపక్ష పార్టీల నేతలు రావడం కష్టంగా మారింది. అయితే ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుందనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు.

opposition party meeting cancel

బీహార్ రాజధాని పాట్నాలో విపక్షాల సమావేశానికి పాల్గొనేందుకు దాదాపు 15 ప్రతిపక్ష పార్టీల నేతలు వచ్చారు. ఈ సందర్భంగా శరద్ పవార్ నుంచి మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ వరకు అందరూ బీజేపీని ఓడించాలంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర రాజకీయాలలో చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ కాలిక్యులస్‌ను మార్చేశాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ బీజేపీ, శివసేన షిండే వర్గంతో చేతులు కలిపారు. అటువంటి పరిస్థితిలో, ఇప్పుడు అజిత్ పవార్ మహారాష్ట్రలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

అజిత్ పవార్ రాజీనామా తర్వాత ప్రతిపక్షాల రాజకీయాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి శరద్ పవార్ పార్టీని మేనేజ్ చేయడంలో విఫలమయ్యారనే మాట వినిపిస్తోంది. అజిత్ పవార్ ద్వారా శరద్ పవార్‌ను బీజేపీ ఓడించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పాటు తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదం కూడా కొనసాగుతోంది. నిజానికి పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe