బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు విపక్షలపాటు ఏకతాటికపైకి వచ్చేందుకు ప్రయత్నాలు షురూ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్ 23న బీహార్ రాజధాని పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం తదుపరి సమావేశం జూలై 13-14 తేదీల్లో బెంగళూరులో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఈ సమావేశం వాయిదా పడింది. పార్లమెంట్ సమావేశాల కారణంగా ఈ సమావేశం వాయిదా పడింది. అలాగే కర్ణాటక, బీహార్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున సమావేశం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమావేశానికి చాలా మంది ప్రతిపక్ష పార్టీల నేతలు రావడం కష్టంగా మారింది. అయితే ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుందనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు.
పూర్తిగా చదవండి..బెంగళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల భేటీ వాయిదా..ఎందుకంటే..!!
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విపక్షపార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. బీజేపీ వ్యతిరేకంగా పలు పార్టీలు గతనెలలో బీహార్ రాజధాని పాట్నాలో సమావేశం అయి పలు అంశాలపై చర్చించాయి. తదుపరి చర్యలను బెంగళూరులో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశం ఇప్పుడు వాయిదా పడింది.

Translate this News: