• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • నిజామాబాద్
  • విజయవాడ
  • వైజాగ్
Home » తెలంగాణలో బీజేపీ ప్రభుత్వానిదే అధికారం: కిషన్‌రెడ్డి

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వానిదే అధికారం: కిషన్‌రెడ్డి

Published on July 27, 2023 3:28 pm by Vijaya

రైతు ఆత్మహత్యల తెలంగాణ మనకొద్దు.. మోదీ నాయకత్వంలోని రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలకు కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ జిల్లా శామిర్‌పేట పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజస్థాన్‌లో ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల్ని ప్రారంభించి ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారని అన్నారు.

Translate this News:

Only BJP government is in power in Telangana: Kishan Reddy

సీఎం కేసీఆర్ (CM KCR)పై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి ( Kishan Reddy)ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం (జూలై 27) మీడియాతో మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం ప్రజల‌ గొంతులు కోసే కుటుంబమని వ్యాఖ్యలు చేశారు. రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో ఫామ్‌హౌస్‌లో కూర్చుని  తీయగా మాటలు చెబుతూ.. గొంతులు కోసే కుటుంబమన మండిపడ్డారు. బంగారు తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కౌలు రైతులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కల్తీ విత్తనాలకు గులాబీ దండే కారణమన్నారు. రైతులపై ఎన్ని కేసులు పెట్టారో కేసీఆర్ చెప్పాలన్నారు. రైతుల కోసమే పుట్టిన అంటివి కేసీఆర్…. ఉచిత ఎరువులు ఏమయ్యాయి అంటూ ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లో మాత్రమే 24 గంటల కరెంట్ ఉందన్నారు. కేసీఆర్ కుటుంబానికి కరెంట్ ఉంది కానీ.. రైతులకు 24 గంటల కరెంట్ లేదని తెలిపారు. ధరణి పోర్టల్ పేరుతో రైతులను ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే అని.. కేసీఆర్‌ను నమ్మవద్దని అన్నారు. నిజమైన రైతు సంక్షేమం బీజేపీతోనే సాధ్యమన్నారు. పోలీసులను పెట్టుకొని ప్రగతి భవన్ (Pragati Bhavan)నుంచి కేసీఆర్ ( KCR) పాలన చేస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజా ప్రగతి భవన్‌ (Praja Pragati Bhavan)గా తీర్చిదిద్దుతామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి రైతు సంక్షేమంపై ప్రత్యేకమైన దృష్టి సారించారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యనించారు.‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’అనే నినాదంతో అన్ని వర్గాలకు సరైన ప్రాధాన్యతనిస్తూ.. అన్నదాతలకు గౌరవాన్ని కల్పించే విధంగా పలు పథకాలకు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. రైతులకు తక్కువ ధరకే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, భూసార పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పీఎం-కిసాన్ ద్వారా రైతుల అకౌంట్లలో ఏడాదికి రూ.6వేల రూపాయలు బదిలీ చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను చెపట్టిందన్నారు.

ప్రజలకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు.. ఒకేచోట అందుబాటు ధరలకు దొరుకుతాయన్నారు. విత్తన పరీక్ష, భూసార పరీక్ష, ఎరువుల పరీక్షలను ఈ సెంటర్ ద్వారా అందిస్తామన్నారు. వ్యవసాయానికి అవసరమైన పరికరాలను.. రైతులకు అమ్మడం అవసరమైతే రైతులకు కిరాయికి ఇవ్వడం ఈ కేంద్రాల ద్వారా చేస్తామన్నారు. ఆధునిక, ఉత్తమ వ్యవసాయ పద్ధతుల మీద రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు రైతులకు ఉపయోగపడే విధంగా చైతన్య పరుస్తూ.. దీంతోపాటుగా.. ఈ కేంద్రాలు నడిపె రిటైలర్ల సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా 8.5 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లోకి రూ.17,500 కోట్లు జమచేయనున్నారు. మన తెలంగాణలో 39.5 లక్షల మంది రైతుల అకౌంట్లలోకి రూ.800 కోట్లు జమ అవుతాయని కిషన్‌రెడ్డి అన్నారు.

Primary Sidebar

INDvsAUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్.. 2-0తో సిరీస్ కైవసం

INDvsAUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్.. 2-0తో సిరీస్ కైవసం

Rajaiah: మరో బాంబ్ పేల్చిన రాజయ్య.. కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు

Rajaiah: మరో బాంబ్ పేల్చిన రాజయ్య.. కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు

Chandrababu: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

Chandrababu: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

Chandrababu: బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వెనక రాజకీయ కారణం ఉందా..?

Chandrababu: బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వెనక రాజకీయ కారణం ఉందా..?

IND vs AUS :  వర్షం కారణంగా  మ్యాచ్‎కు అంతరాయం...నిలిచిపోయిన ఆట..!!

IND vs AUS : వర్షం కారణంగా మ్యాచ్‎కు అంతరాయం…నిలిచిపోయిన ఆట..!!

PM Modi Mann ki Baat : చంద్రయాన్-3, జీ-20తో ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!!

PM Modi Mann ki Baat : చంద్రయాన్-3, జీ-20తో ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!!

VandeBharat Express : తెలుగు రాష్ట్రాలకు మోదీ కానుక..ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని..!!

VandeBharat Express : తెలుగు రాష్ట్రాలకు మోదీ కానుక..ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని..!!

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న డీజిల్, పెట్రోల్ ధరలు..!!

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న డీజిల్, పెట్రోల్ ధరలు..!!

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online