తెలంగాణ రాష్ట్రం ప్రతి ఏడాది విడుదల చేసే బడ్జెట్ లో వేల కోట్లు విద్యావ్యవస్థ కోసం కేటాయించబడతాయి. దీంతో పాటు సంవత్సరం పొడుగునా.. విద్యావ్యవస్థను మెరుగుపర్చడం కోసం ఎన్నో పథకాలను సర్కార్ ప్రవేశపెడుతోంది. కాని పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంలో మాత్రం ప్రభుత్వం విఫలం అవుతూనే ఉంది. దీంతో వసతి గృహాల్లో సదుపాయాలు సరిగ్గా లేక విద్యార్థులు నానా అవస్థలు పడడం, సాంబారు, ఉప్మాల్లో పురుగులు ప్రత్యక్షం కావడం.. కలుషిత ఆహారంతో విద్యార్థులు ఆసుపత్రిపాలు కావడం కామన్ అయిపోయింది.
పూర్తిగా చదవండి..75 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు..టీచర్ల కోసం రోడ్డెక్కిన స్టూడెంట్స్!
టీచర్లున్న దగ్గర విద్యార్థులు లేకపోవడం.. విద్యార్థులున్న ఉన్న చోట పాఠాలు చెప్పేందుకు టీచర్లు సరిగ్గా లేకపోవడమనే సమస్య ప్రభుత్వ విద్యావ్యవస్థను వెంటాడుతూనే ఉంది. దీనికి నిదర్శనమే కామారెడ్డిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 75 మంది విద్యార్థులకు ఒక్కటే టీచర్ ఉండడం.
Translate this News: