Armstrong Murder Case: బీఎస్పీ అధినేత మర్డర్ కేసు.. నిందితుడు ఎన్‌కౌంటర్‌

తమిళనాడు బీఎస్పీ అధినేత ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేశారు పోలీసులు. తమపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా ఎన్‌కౌంటర్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు కుండ్రత్తూరుకు చెందిన తిరువేంగడంగా పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
 Armstrong Murder Case: బీఎస్పీ అధినేత మర్డర్ కేసు.. నిందితుడు ఎన్‌కౌంటర్‌

Armstrong Murder Case:తమిళనాడు బీఎస్పీ అధినేత ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేశారు పోలీసులు. తమపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా ఎన్‌కౌంటర్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు కుండ్రత్తూరుకు చెందిన కె తిరువేంగడం గా పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం మాధవరంలోని సరస్సు సమీపంలో ఆర్మ్‌స్ట్రాంగ్‌పై దాడి చేసి హత్య చేసేందుకు ఉపయోగించిన ఆయుధాలను దాచి ఉంచిన ప్రదేశానికి తీసుకెళ్లారు. తిరువేంగడం ఒక పోలీసుపై దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లు ఆ స్థలంలో, అతను కాల్చి చంపబడ్డాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.

జూలై 5న, పెరంబూర్‌లో నిర్మాణంలో ఉన్న తన ఇంటి బయట నిలబడి ఉన్న ఆర్మ్‌స్ట్రాంగ్‌ను నరికి చంపారు. వెంటనే గ్రీమ్స్‌ రోడ్డులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొన్ని గంటల తర్వాత, తిరువేంగడం సహా ఎనిమిది మందిని నగర పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్టయిన మిగతా వారిలో పొన్నై వి బాలు (39), డి రాము (38), కెఎస్ తిరుమలై (45), డి సెల్వరాజ్ (48), జి అరుల్ (33), కె మణివణ్ణన్ (25), జె సంతోష్ (22) ఉన్నారు. మరుసటి రోజు మరో ముగ్గురు వ్యక్తులు గోకుల్, విజయ్, శివశంకర్‌లను అరెస్టు చేశారు. 2023లో ఫోర్‌షోర్ ఎస్టేట్ సమీపంలో హిస్టరీ షీటర్ ఆర్కాట్ సురేష్ హత్యకు ప్రతీకారంగా ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు గురైనట్లు నగర పోలీసులు తెలిపారు. అరెస్టయిన నిందితుల్లో ఒకరైన పొన్నై వి బాలు సురేష్ తమ్ముడు. జులై 11న నగర పోలీసులు నిందితులను ఐదు రోజుల కస్టడీకి తీసుకుని విచారించారు.

Advertisment
తాజా కథనాలు