ఒలింపిక్ క్రీడాకారులతో కోలాహలంగా మారిన పారిస్ వీధులు !

2024 ఒలింపిక్స్ కు పారిస్ అంగరంగ వైభవంగా సిద్ధమవుతుంది. ఈ నెల 26 న ప్రారంభమై ఆగస్టు 11నాటికి ఈ పోటీలు ముగియనున్నాయి.ఈ సిరీస్‌లో 26 దేశాల నుంచి 10వేల 714 మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఇప్పటికే పారిస్ చేరుకున్న క్రీడాకారులతో అక్కడి వీధులు కోలాహలంగా మారాయి.

ఒలింపిక్ క్రీడాకారులతో కోలాహలంగా మారిన పారిస్ వీధులు !
New Update

పారిస్ లో 2024 ఒలింపిక్ క్రీడలు ఈ నెల 26నుంచి ప్రారంభమై ఆగస్టు 11 కి ముగియనున్నాయి. ఈ సిరీస్‌లో 32 క్రీడాంశాల్లో 329 గేమ్‌లు జరగనున్నాయి. 26 దేశాల నుంచి 10,714 మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఇందుకోసం పారిస్ నగరంలో ఒలింపిక్ మేనేజ్ మెంట్ పలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.దీంతో ఒలింపిక్స్‌కు మరో మూడు రోజుల సమయం ఉండడంతో పారిస్ వీధులు కోలాహలంగా మారాయి. దీంతో ఆ ప్రదేశాలు మొత్తం రద్దీగా మారాయి.

చాలా మంది క్రీడాకారులు పారిస్ ప్రకృతిని ఆశ్వాదిస్తూ పారిస్ వీధుల్లో తిరుగుతున్నారు. ఈ  పరిస్థితిలో, పారిస్ ఒలింపిక్ క్రీడల నిర్వాహక కమిటీ అధిపతి టోనీ, విలేకరులతో మాట్లాడుతూ, ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం చివరి దశ పనులు జరుగుతున్నాయని, పోటీలు జరిగేంత వరకు క్రీడాకారులు అందరూ తగు జాగ్రత్తలు వహించాలని కోరారు.

అయితే, గత కొన్ని నెలలుగా పారిస్‌లో భారీ వర్షాలు కురుసినప్పటికీ,ప్రస్తుతం వాతావరణం మెరుగుపడింది. అలాగే, పారిస్‌లోని చైన్ నదిలో నీటి నాణ్యత పెరిగింది. ప్రారంభ వేడుకల సందర్భంగా నదిపై దాదాపు 6వేల నుండి 7వేల మందికి పోటీదారులు 85 పెద్ద పడవల్లో ప్రయాణించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది వీక్షిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ ఒలింపిక్ క్రీడల ద్వారా ఫ్రాన్స్ మళ్లీ మెరిసిపోతుందని టీమ్ మేనేజ్ మెంట్ లీడర్ టోనీ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఫ్రాన్స్ ప్రభుత్వం ముమ్మరంగా భద్రతా చర్యలు, నియంత్రణలు చేపడుతున్నందున పారిస్‌లోని రెస్టారెంట్లు, హోటళ్లు, బార్‌లకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోందని వ్యాపారవేత్తలు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఒలింపిక్స్‌ను నిర్వహిస్తే మాత్రం ఇలాంటి సంక్షోభాలు తప్పవని నిర్వాహక కమిటీ వివరించింది.

#olympic-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe