నేను శివుడిని..చంపి తిరిగి బతికిస్తా అంటూ వృద్దురాలిని కొట్టి చంపాడు!

తానే దేవుడిని అంటూ ఊగిపోయాడు ఓ వృద్దుడు. అంతటితో ఆగకుండా అటుగా దారి వెంట వెళ్తున్న ఓ అభాగ్యురాలి ప్రాణాలు తీసేవరకు వెళ్లింది ఆ పిచ్చి. అంతటితో ఆగకుండా తిరిగి బతికిస్తానని చెప్పి ఓ వృద్దురాలిని కొట్టి చంపేశాడు ఓ వ్యక్తి.పక్కన ఉన్న వారు ఆపాల్సింది పోయి..జరుగుతున్న దారుణాన్ని ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్‌ జిల్లా గోగుండా పరిధిలో చోటు చేసుకుంది

New Update
నేను శివుడిని..చంపి తిరిగి బతికిస్తా అంటూ వృద్దురాలిని కొట్టి చంపాడు!

చందమామ మీదకు పరిగెత్తుకుంటూ వెళ్లే రోజులు వచ్చినప్పటికీ ఇంకా కొంత మంది మూఢనమ్మకాలతోనే బతికేస్తున్నారు. దానికి తోడు ఫుల్లుగా తాగితే..ఇక చెప్పడానికి ఏముంది. తానే దేవుడిని అంటూ ఊగిపోయాడు ఓ వృద్దుడు. అంతటితో ఆగకుండా అటుగా దారి వెంట వెళ్తున్న ఓ అభాగ్యురాలి ప్రాణాలు తీసేవరకు వెళ్లింది ఆ పిచ్చి. అంతటితో ఆగకుండా తిరిగి బతికిస్తానని చెప్పి ఓ వృద్దురాలిని కొట్టి చంపేశాడు ఓ వ్యక్తి.

పక్కన ఉన్న వారు ఆపాల్సింది పోయి..జరుగుతున్న దారుణాన్ని ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్‌ జిల్లా గోగుండా పరిధిలో చోటు చేసుకుంది. ప్రతాప్‌ సింగ్‌ (70) అనే వృద్ధుడు ఫుల్లుగా తాగి..నేను శివుని అవతారాన్ని..నేను తలచుకుంటే ఏమైనా చేయగలను అంటూ ఊగిపోయాడు.

అంతటితో ఆగకుండా అదే సమయానికి అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న కల్కిబాయ్‌ గమేతి (85) అనే వృద్దురాలు కనిపించింది. తాగి ఊరుకోక ఆ వృద్దురాలిని తన వద్దకు పిలిచాడు. పాపం ఆ పిచ్చిది ఎందుకో అనుకుంటూ అతని వద్దకు వచ్చింది. ఆ మహిళ రావడంతోనే ప్రతాప్‌ సింగ్‌ నేను శివుని అవతారాన్ని ఏదైనా చేయగలను అంటూ ఉపదేశించడం మొదలు పెట్టాడు.

నువ్వు ఒక మహారాణివి...ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ సమయంలో ఇక్కడ ఉన్నావు. నేను నీకు కనిపిస్తున్నారు. చాలా అదృష్టవంతురాలివి. నిన్ను చంపి మళ్లీ బతికించగలను అంటూ ప్రగల్బాలు పలికాడు. అంతటితో ఆగకుండా మరు క్షణంలో ఆమె మీద దాడి చేయడం మొదలు పెట్టాడు.

ఇదంతా జరుగుతున్న సమయంలో ఆ వృద్దుని పక్కన ఇద్దరు మైనర్లు, మరో వ్యక్తి కూడా ఉన్నాడు. వారిలో ఒకరు ఆ వృద్ధుడు దాడి చేస్తున్న సంఘటనను వీడియో తీశాడు. వృద్దుడు ముందు ఆమె గుండెల మీద బలంగా చేతులతో కొట్టాడు. దాంతో వృద్దురాలు ఒక్కసారిగా కిందపడిపోయింది.

అంతటితో ఆగకుండా ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న గొడుగుతో విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె స్పృహ కోల్పొయినప్పటికీ కూడా ఇంకా కొడుతూనే ఉన్నాడు. దాంతో ఆమె ప్రాణాలు కోల్పొయింది.

విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఉదయ్‌పూర్‌ ఎస్పీ భువన్‌ భూషణ్‌ చెప్పారు.

Advertisment
తాజా కథనాలు