ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూకు సంబంధించి ఆగస్టు 2 న సబ్స్క్రిప్షన్ మొదలు కానుంది. ఈ సంస్థ రూ.5,500 కోట్ల పెట్టుబడిని సమీకరించే లక్ష్యంతో కొత్త ఐపీఓతో రాబోతుంది.
స్టాక్ మార్కెట్ లో ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు సంబంధించిన తేదీలను కంపెనీ ఖరారు చేసింది. ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఆగస్టు 2వ తేదీన ప్రారంభం కానుంది. ఆగస్టు 6వ తేదీ లోపు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుందని ఆ తర్వాత షేర్ల కేటాయింపు ఆ తర్వాత ఆగస్టు 9వ తేదీన స్టాక్ మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్ షేర్లు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ రూ.5,500 కోట్ల పెట్టుబడిని సమీకరించేందుకు ఆగస్టు 2న కొత్త ఐపీఓతో రాబోతోంది.షేర్ ఇష్యూ సమయంలో, ఓలా సీఈఓ పవిష్ అగర్వాల్ తన 3.79 కోట్ల షేర్లను కూడా విక్రయించనున్నారు. ఓలా ఎలక్ట్రిక్ ఇండియన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేయబడిన మొదటి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ.