ఎలా జరిగింది..? దర్యాప్తు స్పీడప్

New Update

బాలాసోర్‌ రైలు ప్రమాదంపై దర్యాప్తు స్పీడందుకుంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. ఇటు సీబీఐతో పాటు రైల్వేశాఖ టీమ్‌ కూడా విచారణ చేస్తోంది. ఐతే ఈ కేసులో ముఖ్యంగా ఐదుగురు రైల్వే అధికారుల పాత్రపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు అధికారులు. బహనాగ బజార్‌ స్టేషన్‌ మాస్టర్‌తో పాటు మరో నలుగురు సిగ్నలింగ్‌ సిబ్బంది.. ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో ఉన్నారు. రైల్వే సేఫ్టీ కమిషన్‌ నివేదిక ఆధారంగా వారిపై తదుపరి చర్యలుంటాయని వెల్లడించాయి రైల్వే వర్గాలు.

ODISHA TRAIN ACCIDENT UPDATE

ఉద్దేశపూర్వకంగా చేశారా..? అనుకోకుండా జరిగిందా..? సాంకేతిక లోపంతో జరిగిందా..? అనే కోణాల్లో విచారణ సాగుతోంది. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన సీబీఐ.. కొందరిని విచారించింది. ఐతే.. సిస్టమ్‌ మాన్యువల్‌ ట్యాంపరింగ్‌, ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌లో లోపమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రైల్వే సేఫ్టీ కమిషనర్‌..తన దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఐదుగురు సిబ్బంది కేంద్రంగా విచారణ జరుగుతుందని తెలిపారు సీనియర్‌ అధికారులు.

ఒడిశా బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం యావత్‌ భారతదేశాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనలో 288మంది మృతి చెందారు..వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూనే ఉంది. ఐతే త్వరలోనే CRS నివేదిక రానుంది. ఆ రిపోర్ట్‌ ఆధారంగా సిబ్బంది ప్రమేయముందని తేలితే వారిపై కఠిన చర్యలుంటాయని తెలిపింది రైల్వే శాఖ. మరోవైపు ఈ దుర్ఘటనను రాజకీయం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రైల్వే ఉద్యోగ సంఘాలు. రైల్వే పనితీరుపై వస్తున్న విమర్శలను చూస్తుంటే బాధగా ఉందని..ఇది తమ చిత్తశుద్ధిని అవమానించడమేనంటున్నాయి.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rahul Gandhi: 'ట్రంప్‌కి మోదీ సరెండర్' అయ్యారు.. రాహుల్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారంటూ విమర్శించారు. నరేందర్‌.. సరెండర్ అనగానే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారని సెటైర్లు వేశారు.

New Update
Rahul gandhi

Rahul gandhi

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్‌ పేరుతో పాక్, పీవోకేలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. అయితే తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారంటూ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన పార్టీ కన్వెన్షలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు.   

Also Read: ఇకనుంచి ఒకటవ తరగతి నుంచే బేసిక్‌ మిలిటరీ శిక్షణ !

ఈ సందర్భంగా మాట్లాడుతూ''  ఆపరేషన్ సిందూర్‌ ప్రారంభం అయిన తర్వాత ట్రంప్ ప్రధాని మోదీకి కాల్‌ చేశారు. మోదీజీ .. ఏం చేస్తున్నారు అంటూ ట్రంప్ అడిగారు.  నరేందర్‌. సరెండర్ అనగానే మోదీ కాల్పుల విరమణ ప్రకటన చేశారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా మోదీ పాటించారు.ఇందిరా గాంధీ హయాంలో అమెరికా బెదిరింపులు కూడా లెక్కచేయకుండా పాకిస్థాన్‌ను భారత్‌ ఓడించింది. అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడింది. గాంధీ, నెహ్రూ, సర్దాబ్‌ పటేల్ వీళ్లందరూ కూడా అగ్రరాజ్యలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులే అని'' రాహుల్ గాంధీ అన్నారు. 

Also Read: యుద్ధాల్లో దుమ్ము రేపుతోన్న డ్రోన్లు.. వేల కి.మీ దాటి శత్రువులపై దాడులు

ఇదిలాఉండగా మరోవైపు నీటి పంపకాలపై భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్‌కు నీళ్లు వదలకుండా సిందూ నదీ ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై చైనా ఇండియాని హెచ్చరించింది. బ్రహ్మపుత్ర నదీ జలాలు భారత్‌లోకి రాకుండా అడ్డుకుంటామని చైనా బెదిరిస్తుంది. పాకిస్థాన్‌కు మద్దతుగా చైనా రంగంలోకి దిగింది. సెంటర్‌ ఫర్‌ చైనా అండ్‌ గ్లోలైజేషన్‌ ఉపాధ్యక్షుడు విక్టర్‌ జికాయ్‌ గవో పాక్‌కు సింధూ జలాల నిలిపివేత పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌కు నీరు ఇవ్వకుండా భారత్‌ అడ్డుకుంటే.. చైనా కూడా భారత్‌‌కు నీళ్ల రాకుండా అడ్డుకోగలదని విక్టర్‌ జికాయ్‌ గవో అన్నాడు. సిందూ నదీ జలాల ఒప్పందాన్ని మళ్లీ ప్రారంభించి పాకిస్తాన్‌కు నీళ్లు ఇప్పించాలని చైనా ప్రయత్నిస్తోంది. 

 telugu-news | rtv-news | national-news | Rahul Gandhi | operation Sindoor | trump

Advertisment
Advertisment