ఎన్సీపీలో తిరుగుబాటు తర్వాత ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అజిత్ పవార్ వర్గానికి వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేశారు. షిండే ప్రభుత్వంలో చేరిన ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే సహా, 9 మంది ఎమ్మెల్యేలను శరద్ పవార్ పార్టీ నుంచి బహిష్కరించారు. మరోవైపు ముంబైలో అజిత్ పవార్ కూమా సమావేశం నిర్వహించారు. ఎన్డీయేలో చేరిన ఆర్ఎస్పీ అధ్యక్షుడు రాందాస్ అథవాలే ఈరోజు అజిత్ పవార్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. వీరితో పాటు పలువురు నేతలతో అజిత్ పవార్ భేటీ అయ్యారు.
పూర్తిగా చదవండి..‘ఎవరు ఏం చెప్పినా ఎన్సీపీ అధ్యక్షుడిని నేనే : శరద్ పవార్..!!
తిరుగుబాటు పార్టీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై దావా వేసిన తర్వాత ఎన్సీపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో కార్యవర్గం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో షిండే ప్రభుత్వంలో చేరిన ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, 9 మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు.
Translate this News: