Telangana Elections 2023: టికెట్ రానందుకు బాధగా ఉంది.. అయినా కాంగ్రెస్ లోనే ఉంటా: మానాల మోహన్ రెడ్డి

తనకు బాల్కొండ టికెట్ దక్కకపోవడంపై బాధగా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీని వీడనని ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ నెల 20న జిల్లాలో జరగనున్న రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేస్తామన్నారు. ఆర్టీవీతో ఆయన ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడారు.

Telangana Elections 2023: టికెట్ రానందుకు బాధగా ఉంది.. అయినా కాంగ్రెస్ లోనే  ఉంటా: మానాల మోహన్ రెడ్డి
New Update

అనేక కష్టనష్టాలకు ఓర్చి బీజేపీ(BJP), బీఆర్ఎస్ తో యుద్ధం చేసి పార్టీ కోసం పని చేశానని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి (Manala Mohanreddy) అన్నారు. తనకు బాల్కొండ టికెట్ రాకపోవడంపై బాధ ఉన్నా.. పార్టీ మారే ఆలోచన లేదన్నారు. టికెట్ ఇచ్చిన వ్యక్తికంటే తాను ఎందులో వీక్ గా ఉన్నానో చెబితే బాగుండేదన్నారు. 20వ తేదీన నిజామాబాద్ జిల్లాలో జరిగే రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేస్తామన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) పర్యటన తర్వాత టికెట్ దక్కని విషయంపై ఆలోచిస్తాన్నారు. ఆయన ఇంకా ఏం అన్నారో ఈ కింది వీడియోలో చూడండి.

#telangana-elections-2023 #telangana-congress #rtv
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe