Nifty 50 Record: స్టాక్ మార్కెట్ జంప్.. రూపాయి స్ట్రాంగ్.. మూడు కారణాలు.. 

వారాంతంలో అంటే శుక్రవారం జనవరి 12న స్టాక్ మార్కెట్ రికార్డులు సృష్టించింది. నిఫ్టీ 50 ఆల్ టైమ్ హై కి చేరుకుంది. దీనికి కంపెనీల క్వార్టర్లీ ఫలితాల్లో అనుకూలత, మార్కెట్లో పాజిటివిటీ, డాలర్ తో రూపాయి బలపడటం కారణాలుగా నిపుణులు చెబుతున్నారు 

New Update
Nifty 50 Record: స్టాక్ మార్కెట్ జంప్.. రూపాయి స్ట్రాంగ్.. మూడు కారణాలు.. 

Nifty 50 Record: ఈ ఏడాది కూడా 2023 లానే భారత స్టాక్ మార్కెట్ పెరుగుదల కొనసాగుతోంది. ఇన్వెస్టర్స్ కి వేగంగా లాభాలు వస్తున్నాయి. దీంతో మార్కెట్ కూడా లాభపడుతోంది. ఈరోజు నిఫ్టీ 50 ఆల్ టైమ్ హై ఫిగర్‌ను తాకింది. సెన్సెక్స్‌ పరిస్థితి కూడా అదే. సెన్సెక్స్..  నిఫ్టీలలో ఈ పెరుగుదల ఒక్క రోజులో పెట్టుబడిదారులను సంపన్నులను చేసింది. రూపాయి గురించి చెప్పాలంటే డాలర్‌తో పోలిస్తే ఇది కూడా మెరుస్తోంది. రూపాయి 4 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. వారంలో చివరి రోజున, పెట్టుబడిదారులు లాభాలను(Nifty 50 Record) బుక్ చేయడంతో.. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లో ఇంత పెరుగుదల ఎందుకు వచ్చింది? అనే సందేహం రావడం సహజం. దాని వెనుక ఏముంది? అనే విషయంపై నిపుణులు  మూడు కారణాలు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాం. 

వారాంతంలో రికార్డు స్థాయి
నిఫ్టీ ఈ వారం చివరి ట్రేడింగ్ రోజున అంటే ఈరోజు జనవరి 12న రికార్డును(Nifty 50 Record) నమోదు చేసింది. నిఫ్టీ-50 అంతకు ముందు రోజు ముగింపు 21,647.20 కంటే ఎక్కువ స్థాయిలో  21,773.55 వద్ద ప్రారంభమైంది. తరువాత కొత్త రికార్డు గరిష్ట స్థాయి 21,897.10కి చేరుకుంది. మరోవైపు, సెన్సెక్స్ కూడా అంతకు ముందు రోజు ముగింపు స్థాయి 71,721.18 కంటే పైకెగసి 72,148.07 వద్ద ప్రారంభమైంది. తరువాత ఇది కూడా దాని రికార్డు గరిష్ట స్థాయి 72,619.81కి చేరుకుంది.

ఐటీ షేర్లలో భారీ పెరుగుదల
Nifty 50 Record: ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్‌తో సహా ఐటి మేజర్ల షేర్లు సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాప్ గెయినర్లుగా ట్రేడయ్యాయి. టిసిఎస్ -ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసిక ఆదాయాల తరువాత, చాలా ఐటి స్టాక్‌లు బలమైన లాభాలను చవిచూశాయి. ఉదయం ట్రేడింగ్‌లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5 శాతానికి పైగా జంప్ చేసి 52 వారాల గరిష్ట స్థాయి 36,482.25కి చేరుకుంది. డిసెంబర్ త్రైమాసిక ఆదాయాల తర్వాత ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లలో తొలిసారిగా బలమైన పెరుగుదల కనిపించింది. ఇన్ఫోసిస్ ఏకీకృత నికర లాభాన్ని రూ.6,106 కోట్లుగా ప్రకటించింది, ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే రూ.6,586 కోట్లతో పోలిస్తే 7 శాతం ఎక్కువ. TCS గురించి చూస్తే, డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 60,583 కోట్ల ఏకీకృత నికర ఆదాయాన్ని నమోదు చేసింది.  ఇది వార్షిక ప్రాతిపదికన 4 శాతం వృద్ధిని చూపుతుంది.

త్రైమాసిక నివేదికలో మెరుగైన ఫలితాలు..
ఇప్పటి వరకు కొన్ని కంపెనీల త్రైమాసిక నివేదికలు విడుదల కాగా, వాటిలో చాలా వరకు మెరుగైన ఫలితాలు కనిపించాయి. టాటా కంపెనీ టైటాన్ కూడా మంచి వృద్ధిని సాధించింది. దాదాపు అన్ని కంపెనీల పరిస్థితి ఇదే. ఈ నెలలో విడుదలైన ఇతర కంపెనీల ఫలితాల్లో మెరుగైన ఫలితాలు కనిపించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక  నిఫ్టీ-50(Nifty 50 Record) గురించి చూసినట్లయితే, అది CAGR 14.6% చొప్పున వృద్ధిని సాధించింది. ఇది పెట్టుబడిదారులకు మంచి ఆశను కల్పిస్తోంది. ఆదిత్య బిర్లా మనీ తన త్రైమాసిక నివేదికను కూడా ఈరోజు విడుదల చేసింది, దాని లాభం YOY ఆధారంగా రూ. 9 కోట్ల నుంచి రూ. 42 కోట్లకు పెరిగింది.

Also Read: పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు.. ఈరోజు రేట్ ఇదే 

మార్కెట్‌లో పాజిటివ్‌ ట్రెండ్‌
Nifty 50 Record: 2024 ప్రథమార్ధంలో US ఫెడ్, RBI రేట్ల కోత అంచనాలు మార్కెట్‌కు సానుకూల ధోరణిని అందించాయి. అంతే కాకుండా మళ్లీ అదే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పెట్టుబడిదారులు ఆశిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, రాబోయే సంవత్సరాల్లో మార్కెట్ మెరుగైన రాబడిని పొందగలదని భావిస్తున్నారు. ఈ విశ్వాసంతోనే విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. గతేడాది ఎఫ్‌ఐఐ ద్వారా రూ.2.4 లక్షల కోట్లు భారత మార్కెట్‌లోకి వచ్చాయి. అంటే విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు.

డాలర్ ముందు మెరుస్తున్న రూపాయి
Nifty 50 Record: మన రూపీ గురించి చూస్తే,  భారత రూపాయి కూడా దాని రికార్డు స్థాయికి పెరుగుతోంది. నిన్న  డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.20% బలపడింది. ఇటీవల, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ దాస్ భారత బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశ వృద్ధికి తోడ్పడటానికి మంచి స్థానంలో ఉందని ఉద్ఘాటించారు. అలాగే, విదేశీ పెట్టుబడిదారులు భారతదేశంలో డాలర్లను వేగంగా పెట్టుబడి పెడుతున్నారు.  దీని కారణంగా రూపాయి బలపడుతోంది.

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు