తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని, పది సంవత్సరాల్లో కేవలం రెండు కోట్లు మాత్రమే తెలంగాణకు కేటాయించారని అన్నారు. తెలంగాణ పట్ల భారత ప్రధాని వివక్ష చూపుతున్నాడన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్ని నెరవేస్తామని పార్లమెంటు సాక్షిగా అప్పటి హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పాడు. అత్యధికంగా మన సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి నిధులు వస్తున్నాయని అన్నారు. కాజీపేటలో డివిజన్ కేంద్రం చేయాలని డిమాండ్ ఇంతవరకు చేయలేదు. స్థలాల సేకరణకు 14 ఏళ్లు పట్టింది, ఇప్పటికీ ఎన్నికల స్టంట్గానే వ్యాగన్ ఫ్యాక్టరీ చూడాలన్నారు. ములుగులో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని స్థలాన్ని కూడా సేకరించి ఇచ్చామన్నారు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదన్నారు.
పూర్తిగా చదవండి..మోదీ పర్యటనకు ఆహ్వానం అందలేదు బండ ప్రకాష్ షాకింగ్ కామెంట్స్
తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ప్రధాని మోదీ వరంగల్ పర్యటనను ఉద్ద్యేశించి హాట్ కామెంట్స్ చేశారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీకి తెలంగాణ ఉద్యమానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. నరేంద్ర మోదీ సభకు ఇంతవరకు అధికారికంగా మాకు ఆహ్వానం అందలేదని విమర్శించారు. తెలంగాణలో పర్యటిస్తూ ఆహ్వానం అందకపోవడాన్ని తప్పుపట్టారు. వరంగల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్లని పూర్తి చేయకుండా పర్యటన ఏంటని ప్రధాని మోదీని ప్రశ్నించారు.
Translate this News: