యువకుడు ప్రశాంత్ తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ఇద్దరికీ వివాహం చేద్దామని యువతి తల్లిదండ్రులతో మాట్లాడగా.. ఇద్దరి కులాలు వేరు కావడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో మేజర్లయిన ప్రేమికులు ఈ నెల 8న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. 9న కర్నూలు జిల్లా పాలబుగ్గ సమీపంలోని ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇంటికి వచ్చేందుకు, తమ ఇద్దరికి ప్రాణరక్షణ కల్పించాలంటూ గద్వాల రూరల్ పోలీస్స్టేషన్కు మంగళవారం చేరుకున్నారు. చేరుకున్నాక అమ్మాయి తల్లిదండ్రులు బలవంతంగా అమ్మాయిని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు.
పూర్తిగా చదవండి..పోలీస్స్టేషన్ సాక్షిగా ప్రేమజంటపై తల్లిదండ్రుల దాడి
పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గద్వాలకు చెందిన ప్రశాంత్, మండలంలోని పూడూరుకు చెందిన శిరీష ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి ఇళ్లలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కోరుతూ పోలీస్ స్టేషన్కు వెళ్లగా యువతి కుటుంబీకులు పోలీస్ స్టేషన్లోనే వారిపై దాడికి పాల్పడ్డారు.
Translate this News: