రోజూలాగే.. మంగళవారం ఉదయం బండ్లగూడ సన్ సిటీ వద్ద అనురాధ తన కూతురు మమత, కవిత అనే మహిళతో కలిసి మార్నింగ్ వాక్ కు వెళ్ళారు. మార్నింగ్ వాక్ చేస్తున్న వారిని విధి వక్రీకరించింది. కారు రూపంలో తమ జీవితాలను ఛిదిలం చేస్తాయని అనుకోలేదు. ఫుట్ పాత్ పై మార్నింగ్ వాక్ చేస్తున్న వారిపైకి మృత్యురూపంలో కారు దూసుకొచ్చింది. అంతేకాకుండా.. అక్కడే మార్నింగ్ వాకర్స్ పై దూసుకుని పొదల్లోకి వెళ్లింది. దీంతో తల్లి కూతురు అనురాధ, మమత అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
పూర్తిగా చదవండి..మార్నింగ్ వాకర్స్పైకి దూసుకొచ్చిన కారు, తల్లి, కూతురు మృతి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో కారు బీభత్సం సృష్టించింది. ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేస్తున్న తల్లి కూతుర్లపై కారు దూసుకుపోయింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.హైదర్ షాకోట్ శాంతినగర్ లో అనురాధ కుటుంబం నివాసం ఉంటుంది. రోజూ తన కూతురుతో కలిసి అనురాధ మార్నింగ్ వాక్ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Translate this News: