ఏపీలో ప్రభుత్వం మారడంతో.. అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నంతా జగన్ తన క్యాంప్ ఆఫీసులో ప్రభుత్వ ఫర్నీచర్ అలాగే ఉంచుకున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ సాగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై రియార్ట్ అయిన వైసీపీ.. ఈ విషయంపై ప్రభుత్వానికి ఇప్పటికే సమాచారం ఇచ్చామని తెలిపింది. ఆ ఫర్నీచర్ కు విలువకట్టి చెబితే.. డబ్బులు చెల్లిస్తామని తెలిపామని వెల్లడించింది. అయితే.. తాజాగా మాజీ సీఎం జగన్ కు సంబంధించి మరో అంశం సెక్రటేరీయట్ లో చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్లలో కేబినెట్ భేటీకి తప్పా… జగన్ సెక్రటేరియట్కు రాలేదన్న చర్చ సాగుతోంది.
పూర్తిగా చదవండి..AP Ex CM Jagan: జగన్ మనుషులనే కాదు మిషన్లను కూడా నమ్మడు.. ఏపీ సచివాలయంలో కొత్త చర్చ!
ఏపీ మాజీ సీఎం జగన్ గురించి ఏపీ సచివాలయంలో మరో సరికొత్త చర్చ మొదలైంది. అభద్రతా భావంతోనే ఐదేళ్లు సచివాలయం వైపు జగన్ రాలేదన్న డిస్కషన్ సాగుతోంది. మనుషులను కాదు మిషన్లను కూడా నమ్మకపోయేదని.. దీంతో కోట్లు పెట్టి క్యాంపు కార్యాలయానికి కొత్త పరికరాలను కొన్నారని తెలుస్తోంది.
Translate this News: