నీట్ లీకేజ్ లో ప్రధాన నిందితుడు అరెస్ట్!

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ పరీక్ష అవకతవకల కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రంజన్ ను పాట్నాలో CBI అధికారులు అదుపులో తీసుకున్నారు.ఈ లీకేజ్ కి సంబంధించి 30 మందికి పై CBI కేసులు నమోదు చేసింది.ఇప్పటికే బీహార్, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో CBI పలువురిని అరెస్ట్ చేసింది.

నీట్ లీకేజ్ లో ప్రధాన నిందితుడు అరెస్ట్!
New Update

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో జూనియర్ మెడికల్ కోర్సులకు నీట్ పరీక్ష మే 5న జరిగింది. జూన్ 4న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో రికార్డు స్థాయిలో 67 మంది అభ్యర్థులు 720కి 720 మార్కులు సాధించారు.దీంతో ప్రశ్నపత్రం లీక్ కావడం, సిబ్బంది మార్పు వంటి అనేక అవకతవకలు జరిగాయని దేశవ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి 30కి పైగా వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకుంది. ఈరోజు ప్రధాన నిందితుడు రాకేష్ రంజన్‌ను పాట్నాలో సీబీఐ అదుపులో తీసుకుంది.. ఇప్పటికే బీహార్, జార్ఖండ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేశారు.

#test-need #medicalentrance #neet-exam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి