లోకసభ ఎన్నికలు దృష్ట్యా ప్రధాన పార్టీలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల పోరులో కలిసి వచ్చేందుకు ప్రతిపక్షాలు మహాకూటమి ఏర్పాటులో నిమగ్నమై ఉంది. ఎన్డీఏ కూడా తన మిత్రపక్షాలతో భేటీ అయ్యేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు ఎన్డీఏ కూటమి సమావేశం కానుంది. ఈ భేటీలో 38పార్టీలు పాల్గొంటున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. కొన్నిరోజుల్లో రాజస్థాన్, ఎంపీ, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలు, ఎన్డీఏ కూటమి రెండూ కూడా సన్నద్ధం అవుతున్నాయి.
పూర్తిగా చదవండి..తగ్గేదేలే అంటోన్న ఎన్డీఏ..ప్రతిపక్షాలకు ధీటుగా 38పార్టీలతో సమావేశం..!!
దేశంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. రానున్న లోకసభ ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకుని అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ ఇప్పటికే ప్రతిపక్షపార్టీలన్నీ ఏకమయ్యాయి. అటు ఎన్డీఏ కూడా తన మిత్రపక్షాలతో సమావేశం అవుతోంది. ఈ రెండు కూటమలు కూడా నేడు సమావేశం కానున్నాయి. ప్రతిపక్షాలు కర్నాటక రాజధాని బెంగళూరులో సమావేశం అయితు..ఎన్డీఏ 38పార్టీలతో దేశ రాజధాని ఢిల్లీలో సమావేశం అవుతోంది.
Translate this News: