2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు రాజకీయ చదరంగం సిద్ధమైంది. నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమైన వేళ…ఇప్పుడు బీజేపీ కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. విపక్షాల సమావేశానికి కౌంటర్ గా…ఎన్డీయేలోనూ ఏకతాటిపై ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో జులై 18న రాజధాని ఢిల్లీలో ఎన్డీయే భారీ సమావేశం జరగనుంది. ఎన్డీయేలో ఉన్న అన్ని పార్టీలతో పాటు ఇతర పార్టీలు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశానికి అకాలీదళ్కు చెందిన సుఖ్బీర్ బాదల్, టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
పూర్తిగా చదవండి..విపక్షాలకు బీజేపీ ఝలక్..ఈనెల 18న ఎన్డీయే పక్షాల సమావేశం..!!
విపక్షాలకు ఝలక్ ఇచ్చేందుకు బీజేపీ రెడీ అవుతోంది. జూలై 18న ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షపార్టీలన్నీ ఏకమైన..తరుణంలో విపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు ఎన్డీఏ ఈ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కూడా ఆహ్వానం అందే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Translate this News: