ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే… మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నాన్నేమైనా అనండి. కానీ మా నాన్నను ( శరద్ పవార్ ) పల్లెత్తు మాట అన్నా ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. అవినీతితో దేశాన్ని సర్వ నాశనం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా శరద్ పవార్ పోరాటం చేస్తున్నారని సుప్రియా సూలె అన్నారు.
పూర్తిగా చదవండి..మా నాన్నను ఒక్కమాట అన్నా ఊరుకోను..!!
మహారాష్ట్ర రాజకీయాలో కీలక పరిణామం చోటచేసుకుంది. పార్టీ అధ్యక్షపదవి శరద్ పవార్ నుంచి అజిత్ పవార్ లాక్కున్నారు. ఎన్సీపీ తిరుగుబాటు వర్గం శరద్ పవార్ తన జాతీయ ఆధ్యక్షుడు కాదని..అజిత్ పవార్ తమ అధినేత అంటూ పేర్కొంది. ఈ పరిణామాల మధ్య శరద్ పవార్ వయస్సుపై సంచలన వ్యాఖ్యలు చేశారు అజిత్ పవార్. వయస్సు మీద పడిందని..ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె మండిపడ్డారు. మమ్మల్ని ఏమైనా అనండి..కానీ మా నాన్నను ఒక్కమాట అన్నా కూడా ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Translate this News: