Nayanthara : వయనాడ్ విపత్తుకు నయనతార, విఘ్నేశ్ దంపతుల భారీ విరాళం.!

కేరళ రాష్ట్రం వయనాడ్‌ విపత్తులో బాధిత కుటుంబాలకు సాయం చేసేందుకు పలువురు సినీ తారలు ముందుకొస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు తమ వంతు సాయంగా రూ.20 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందించారు.

Nayanthara : వయనాడ్ విపత్తుకు నయనతార, విఘ్నేశ్ దంపతుల భారీ విరాళం.!
New Update

Nayanthara 20 Lakhs Donation To Kerala CM Relief Fund : కేరళ (Kerala) రాష్ట్రం వయనాడ్‌ (Wayanad) విపత్తు యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మెప్పాడి స‌మీపంలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వల్ల 300 వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో వందల సంఖ్యల్లో ప్రజలు గాయాలపాలయ్యారు. కూలిపోయిన భవనాలు శిథిలాల కింద ప్రాణాలతో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

వయనాడ్‌ విపత్తుకు నయనతార రూ.20 లక్షల విరాళం

ఈ నేపథ్యంలో ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి పలువురు సినీ తారలు ముందుకొస్తున్నారు. తమ వంతు సాయం చేస్తున్నారు. అయితే తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara), విఘ్నేశ్ శివన్ డా దంపతులు తమ వంతు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. రూ.20 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందించారు. ఇప్పటికే పలువురు సినీ తారలు విరాళాలు అందించారు. మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ రూ.35 లక్షలు, హీరో సూర్య, కార్తీ ఫ్యామిలీ రూ.50 లక్షలు, ఫహాద్‌ ఫాజిల్‌ రూ.25 లక్షలు, రష్మిక ర.10 లక్షలను సీఎం రిలీఫ్‌ ఫండ్‌ (CM Relief Fund) కు విరాళంగా అందించారు.

Also Read: Kalki 2898 AD: ఓటీటీలో ప్రభాస్ 'కల్కి 2898 AD'..! స్ట్రీమింగ్ అక్కడే..? - Rtvlive.com

#nayanthara #wayanad #kerala
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి