Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి, 50 మందికి పైగా..

ఒడిశాలోని పూరిలో జరిగిన రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు ముగ్గురు స్పాట్‌లో మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అదే సమయంలో తొక్కిసలాటలో మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఇవాళ ఉదయం జరిగింది.

New Update
odisha puri stampede

odisha puri stampede

ఒడిశాలోని పూరిలో జరిగిన రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు ముగ్గురు స్పాట్‌లో మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అదే సమయంలో తొక్కిసలాటలో మరో 50 మందికి పైగా గాయపడ్డారు. జగన్నాథుడు, బలభద్రుడు, దేవత శుభ్రద్ర విగ్రహాలను మోసుకెళ్తున్న మూడు రథాలు శ్రీ గుండిచా ఆలయం సమీపంలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇది జగన్నాథ ఆలయం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. 

ఎలా జరిగిందంటే?

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ విషాద ఘటన ఇవాళ ఉదయం జరిగింది. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పవిత్ర రథం గుండిచా ఆలయాన్ని సందర్శించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. దీంతో రథం దగ్గర జనసమూహం పెరగడంతో చాలా మంది పడిపోయారు. అప్పుడే తొక్కిసలాట జరిగింది. 

ఈ ప్రమాదంలో 3 మంది అక్కడికక్కడే మరణించారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ప్రభాతి దాస్, బసంతి సాహు అనే ఇద్దరు మహిళలు ఉన్నారు. అలాగే 70 ఏళ్ల ప్రేమకాంత్ మొహంతి మరొకరు. ముగ్గురూ ఒడిశాలోని ఖుర్దా జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు